Pages

Tuesday, September 16, 2014

With in me: దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే

With in me: దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే

దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే

తెలంగాణ  రాక ముందు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికం గా జరపడం లేదని నానా యాగి చేసి న KCR , తెలంగాణ  ప్రాంతం కు స్వాతంత్రం వచ్చిన రోజును అధికారికం గ జరపని ఆంధ్ర నాయకులకి ఇంగిత జ్ఞానం లేదని చెప్పిన కోదండ రామ్ -  ఈరోజు 17 వ తారీకున, తెలంగాణ స్వయం పాలనలో,  విమోచన దినోత్సవాన్ని అధికారికం గ జరుపుకోవడం కుదరదని చెప్పినప్పుడు సిగ్గు గా  అనిపించలేదా?.  17 వ తారీకు అధికరికమగా జరుపుకోము అని చెప్పడం, తెలంగాణా ఆత్మ గౌరవాన్ని, సాయుధ పోరాటం లో ప్రాణాలు అర్పించిన తెలంగాణా ప్రజలని, మానాలు కోల్పయిన వేలాది మంది మహిళలు గౌరవాన్నిఎవడి కాల్ల కింద తాకట్టు పెట్టడం వల్ల అలా చెప్పావు!. ఈ చర్య ఆనాటి ఉద్యమాన్ని  ని అవమాన పరచడం కాదా.?
స్వతంత్రం వచ్చిన తదుపరి, తెలంగాణా ని పాకిస్తాన్ లో కలిపెస్తము అని ప్రకటించిన నిజాం, వాడి పేరు చెప్పుకునే తిరిగే చంచా ల మద్దతుకోసం ఇంతకి తెగించాలా.? రాజకార్లతో వేల కొద్దీ హత్యలు, మానబంగాలు చేపించిన నిజాం ఎలా గొప్పవాడో KCR  కే తెలియాలి. హైదరాబాద్ మెట్రో ని NizMetro  గ ఎందుకు పేరు మారుస్తున్నావు ?September 17 మంచిఉ రోజా, చెడ్డ రోజా అనే దాని పైన TRS వాళ్ళ స్టాండ్ ఏంటో ప్రజలకి చెప్పాలి. KCR  భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి CM  అయ్యావు కాని, మజ్లీస్ పార్టీ పైనో, పాకిస్తాన్ రాజ్యాగం పైనో కాదు దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే. ............ for India 

Sunday, September 22, 2013

నా కుటుంబం, తెలంగాణ లొ.....

..... వరంగల్ జిల్లా గోవిందరావుపేట లో చాల సంతోషం గ నా బాల్య జీవితం సాగిపోయింది. నాతో పాటు నా మిత్రులయిన రావింద్రచారి, శ్రీను, రాజేష్  ఇంకా  కొంత మంది పేర్లు గుర్తు లేని వారు ...... అప్పట్లో వాళ్ళకి తెలిసి ఉండదు మా తాతాలది ఆంధ్ర ప్రాంతం అని, మరియు  నాకు తేలీదు నేను ఆడుకునే  నా మిత్రులు తెలంగాణ వారు అని. 
 అప్పుడు మాకు తెలిసింది  సాయంకలమయితే సైకిల్ టైరు  వేసుకుని ఊరంతా తిరగడం, వెళ్లి వాగుల్లో దూకి ఆడుకోవడం.  వాడు పోయొత్త అన్నా, నేను వెళ్లి వస్తా అన్న, వాడు ఏందిరా అట్టున్నావ్ అన్నా , నేను ఏంటి రా అల ఉన్నావు అన్నా,  వాడు ఇంట్లో బతుకమ్మ ఆడిన, మా ఇంట్లో లేకున్నా  .....  ఏనాడు కూడా  వాడు వేరే, నేను వేరే అన్న భావన  కాని, వ్యత్యాసాలు కాని మాకు తెలియవు.  

KCR పుణ్యమా అని ఇక ఆ ఆనందం, తేడాల్లేకుండా ఉండే స్నేహం, నేను పెరిగినప్పటి వాతావరణం నా ఊర్లో పెరిగే  నా తరవాత తరానికి లేదేమో. ఒక మాట అంటే వాడి యాస ఏంటి నా యాస ఏంటి, అవతలి వాడు వొత్తు ఎకక్డ పెట్టాడు, నేను  ఎక్కడ పెట్ట, నా ఊర్లో నాతో పాటు  ఉండే  వ్యక్తి ఆంధ్ర వాడు కాబట్టి వాడు నన్ను దోచేసుకున్నాడు అనే భావన , ఈలాంటి కలుశితమయిన ఆలోచన లు ని స్ప్రెడ్ చెయ్యడం లో చాలా విజయం సాధించాడు KCR. 

మా నాన్న గారు చిన్నప్పుడు , అంటే మా తాత తను యుక్త వయసులో ఉన్నప్పుడు , మా ముత్తాత కృష్ణ జిల్లా  ని వదిలి గోవిందరావుపేట  వచ్చేసరట. కృష్ణ జిల్లా లో  ఆస్తులు అమ్ముకుని, గోవిందరావుపేట లో ఒక  ఇల్లు,కాస్త పొలం కొనుక్కుని (కొనుక్కుని - దోచుకుని కాదు ) వ్యవసాయం చేసేవారు మా తాతయ్య. అదే ఊర్లో దాదాపు 40-50 సంవత్సరాలు నుండి ఉంటున్నాము. మొన్న మొన్నటి  వరకు కూడా ఎవరికీ కూడా ప్రాంత తో కూడిన ఆలోచనలు లెవు. 
KCR   పదే పదే ఆంధ్ర వాళ్ళు మమ్ముల్ని  (వాడూ  ఆంధ్ర వాడె అనుకోండి) దోచేసుకున్నారు, గో బ్యాక్ ఆంధ్ర  అంటుంటే, చిరాకు వేసేది. అంత దోచేసుకుంటే 50 సంవత్సరాలుగా బ్రతుకుతున్న మాకు గాని మా ఊర్లో నివసిత్సున్న ఇంకా 100 ల ఆంధ్ర కుటుంబాలు గని ఎటువంటి తగువులు లేకుండా ఎలా బథుకుతున్నరు. తగువు లు పక్కన పెడితే ఊరి జనాలు మాకు ఎందుకు కాస్త ఎక్కువ గౌరవం ఇస్తారు??? 
నేను మా తాత  ని అడిగా తాతయ్య, గుడివాడ  లో అక్కడ పొలాలు బంధువులు స్నేహితులు ఉండగా అవన్నీ వదిలేసి కుటుంబం తో సహా  మీరు ఎందుకు వరంగల్ వచ్చారు అని. తెలంగాణ లో వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యడానికి, అప్పటికే వ్యవసాయం లో ముందు ఉన్న ఆంద్ర వారిని  రమ్మని ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆస్తులు అమ్ముకుని వచ్చిన వేలాది కుటుంబాలలో మనము ఒకల్లము ర అని..... అల వచ్చిన ఆంధ్ర వాల్లే వరంగల్ లో  కానీ, మెదక్ లో కానీ, నిజామాబాదు లో కాని, ఖమ్మం లో గని ఉన్నారు అని. ఇక్కడ తెలుగు మీడియం లో పాటాలు చెప్పేవాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఆహ్వానించి తీఉస్కుని వచ్చిన టీచర్స్ వాళ్ళలో ఉన్నారట.  తెలుగు పాటాలు  చెప్పలేకపోవడం ఏంటి అంటే, నిజాం పాలనలో తెలుగు ఎవరిని నేర్చుకునే అవకాశం కల్పించలేదు రా, అంత ఉర్దూ మీడియం అందుకే తెలంగాణా లో ఉర్దూ పదాల వాడకం ఎక్కువ అని ....... మరి అలా వ్యవసాయ  అభివృద్దికి, విధ్యభివ్రుద్దికి వచ్చిన వాల్లని గౌరవించడం పక్కనపెడితే,  దోచేసుకున్నారని  అనడం, ఉన్న చరిత్రని తొక్కిపెట్టి అసత్య ప్రచారం చేయడం ఏ లాభం కోసమో అందరికి  తెలుసు కాబట్టి చెప్పడం లేదు. 

1 ఇయర్ బ్యాక్ ఇండియా వెళ్ళినప్పుడు మా ఊర్లో మా సందులో   ఉండే 90 సంవత్సరల లంబాడి అవ్వ పేరు కంటి, చెప్తుంది, మీ తాత  ఇచ్చిన వడ్ల తోటే నా పిల్లగాండ్లకు పెండ్లిళ్ళు చేసిన అని, మీ తాత నాయనమ్మ ఉన్నప్పుడు పండగలెక్క ఉండే అని.... 
నా చిన్నపుడు గుర్తు ఉంది, నేను 3 తరగతి చదువుతున్నపుడు కూడా ఊర్లో ముసలి వాళ్ళు కూడా నీ  బాంచన్ దొర అని కాళ్ళు పట్టుకోడానికి వంగే వాళ్ళు...... నాకు చాల బయం వేసేది ఎందుకు అంత పెద్ద వయసున్న తాత  అట్లా బాంచన్  అని కాళ్ళు పట్టుకున్తున్నాడు అని, మా నాయనమ్మ తాతయ్య  చూస్తె ఆయన్ని తిట్టే వాళ్ళు చిన్న పిల్లలకి అలా పెట్టకూడదు అని, మా ఇళ్ళలో ఇలాంటివి ఉండవు అని ............. తెలంగాణా లో దొర లు సామాన్య జనాన్ని ఎంతగా అణచివేసారో  తెలిపే చిన్న ఉధహరన అది . మేము దొరలము కాదు, కానీ ఏ పాటి చిన్న మేడ (కాంక్రీట్ బిల్డింగ్) తెలంగాణ లో ఉన్న, వాల్లని  దొర అని పిలవాలి, కింద కూర్చోవాలి, లాంటి పద్ధతులు  ఎంత లోతుల్లోకి ఉన్నాయో అర్ధమవుథున్ది. 

ఆంధ్ర కలవకముందే తెలంగాణ rich అని చెప్పేవారు, ఎందుకు ఎలా.... హైదరాబాద్ స్టేట్  ని పరిపాలించిన నిజాం , ప్రపంచం లో కల్ల  most  richest  prince  అయ్యాడో కూడా తెలుస్కుంటే కళ్ళు తిరిగే నిజాలు అర్ధమవుతాయి. 

తెలంగాణ లో సాయుధ పోరాటం లో, విద్య, వ వ్యవసాయం, ఉపాధి రంగాల అభివృద్ధి లో ఆంధ్ర వారి కృషి  ఎంతో ఉందని, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే, ఆంధ్ర వాళ్ళని నిష్కారణము గ తిట్టవలసిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. రాజకీయాలు సత్య అసత్య లా ఆధారముగా జరగడం లేదు కాబట్టి, కనీసం చదువుకున్న వారయినా సత్యాలని తెలుస్కోవాలన్న ఉద్దేశమే ఈ చిన్న  వ్యాసం. 


Sunday, May 12, 2013

అమ్మ నీ ప్రేమ కన్నా గోప్పదయింది, నేను పొందగలిగిన వేరొక ఆనందం అంటూ ఏమి లేదు

అమ్మ అన్నాక అందరి అమ్మలు గొప్పవారే, మా అమ్మ గొప్పది, వేరొకరి అమ్మ గొప్పది కాదు అనేది ఏమి లేదు...... 
కాని మానవ సహజం కదా... నా తల్లి అందరి  తల్లుల కన్నా కాస్త గొప్పది అనిపిస్తుంటుంది :-)

ఊర్లో మాకు పొలాలు గేదలు ఉండేవి అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మముత్తాత జేజమ్మ  తో ఊర్లో ఉన్దెవల్లము.. ఎంత హ్యాపీ లైఫ్, పోల్లల్లో తిరుగుతూ చదువు సంధ్య పట్టించుకోకుండా ఊరేమ్మట ఒక సైకిల్ టైరు వేసుకుని తిరగడం, గేటు బయటనుండే పుస్తకాల సంచి విసేరేసి రోడ్డు ఎక్కేయ్యడం .... నావి  అన్ని సబ్జెక్టు మార్కులు కలిపినా 50 దాటేవి కావేమో ...... అమ్మ కి మాత్రం పాపం నా మీద ప్రతిరోజు బెంగే, నేను ఎక్కడ ఆ ఊర్లో చిక్కుకుపోతనో, మా నాన్న లాగా ఏ ఆదాయం లేని ఆ వ్యవసాయం లో కూరుకుపోతనో అని.... ప్రతి రోజు తన  ఒల్లో కూర్చోబెట్టుకుని చదువుకుంటే ఎన్ని లాభాలో వివరిస్తూ ఉండేది..... , నా 5 తరగతి అనుకుంట, రోజు పక్కన అత్త వాళ్ళ ఇంట్లో నుండి తెలుగు పేపర్ తెప్పించి  చదివిపించేది, అప్పట్లో తెలుగు కూడా చదవడం వచెది కధు, మల్లీ తెలుగు మీడియం నాది :-)... మనకు అసలా  లోపల చదువుకోవాలని  అని ఉంటె కదా రావడానికి ..  ...  చిన్న తనం లో  తెలియక నేను అరుస్తూ నేను చదువుకోను నాకు ఇష్టం లేదు, నేను తాతయ్య లాగా వ్యవసాయం చేస్తా  అని పారిపోయెవన్ని.. 7 క్లాసు లో అనుకుంట, నా  మార్కులు చూసి తఃట్టుకోలేక ఏడ్చేసింది .... కనీసం 100 కి 32 మార్కులు  ఉంటె సంతోశాపదేశేమో పాస్ % అని..:-) మనకి పాస్ అవ్వడం అంటే చాల కష్టం ఆ రోజుల్లో ... కాని నన్ను చదువుకోసమని మా అమ్మ  ఏ రోజు కొట్టలేదు తిట్టలేదు, కోప్పడలేదు ..... 

అంతగా చదువుకోని మా అమ్మ విలువల విషయం లో చాల కచితంగా ఉన్దెధి... మా  అక్క వాళ్ళ ఫ్రండ్స్ (కోతి మూక, వానర సైన్యం, రాక్షస అంశ, దెయ్యాలు లాంటి వాళ్ళు గా అనిపించేది అప్పట్లో ) వచ్చి నేను పెంచే చెట్లని  పీకేస్తున్నారని వాళ్ళని తిట్టాను, కొన్ని బూతులు తిట్టి ఉంటాను లే .... ఆ రోజు కొట్టింది మా అమ్మ బెల్ట్ తో పిచ్చ పిచ్చ గ, అదే మొదటి సారి నన్ను కొట్టడం మా అమ్మ.... రెండో సరి మా అక్క మీద కోపాన్ని తట్టుకోలేక నన్ను చంప మీద కొట్టింది నా ఇంజనీరింగ్ లో .....తర్వాత  వచ్చి నన్ను పట్టుకుని బాధపడింది కొట్టానని, ఆ రోజు అంత నా పక్కనే పడుకుంది ... పిల్లల మీద చెయ్యి వేసేది కాదు అమ్మ, ఇన్ల్తొ ఎన్ని టెన్షన్ ఉన్న ఎంత పని ఉన్న, మా మీద కి అది చూపించేది కాదు  ....  . అమ్మ మాత్రం ఏ పని చేసిన చివరికి ఏమి లేక గేదలు కాసుకున్న సరే తలెత్తుకుని బతకడం ర ముఖ్యం అని చెప్పేది,....  అమ్మ ఏ పని ని  అయిన గౌరవించాలి ర అని చెప్పేది .... ..అప్పట్లో అమ్మ మాటల్లో లోతు అర్దమయ్యేది కాదు   ..... అమ్మ అప్పుడప్పుడు బాధపడుతుంటుంది అంతరి తల్లుల్ల్గా మీకు Boost లు లాంటివి ఇచ్చి పెంచుకోలేక పోయాను రా అని,....  ఏ boost ఇవ్వకుండానే ఇంత బూస్ట్ అయ్యింది బాడీ :-) నీ ప్రేమ వల్ల  అనుకుంట . ..... 
ఊర్లో ఆడవాళ్లు అంతా కలిసి కూర్చుంటే, కాసేపు అయ్యాక, వాళ్ళు అల వీళ్ళు ఇలా అని ఎవరన్నవేరే వాళ్ళ పైన  చెప్పుకుంటూ ఉంటె అక్కడనుండి  లెగిసి వచ్చేసేది.... అమ్మకి నచ్చదు ఒకల గురించి చెడు మాట్లాడుకోవడం .... వేరొకరి విషయాలు అమ్మకి తెలిసన, చివరకు ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరి పైన చెడుగా చెప్పేది కాదు.... , నేను ఇప్పటివరకు అమ్మ నోట్లో నుండి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అని చెప్పడం వినలేదు ...... ఒకసారి అమ్మ నాతో సరదాగా మాట్లాడుతూ, పెళ్లి గురించి వచ్చి నేను "అమ్మ ఈరోజుల్లో అమ్మాయిలు ఎవరు కాలీగా ఉండటం లేదు, ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నేను చేసుకోవాలేమో అని నవ్వుతూ అంటే, అమ్మ  "అలా అనకూడదు నాని , ఏ అమ్మాయి వేరేవరినో పెళ్ళిచేసుకోవాలని ఇంకొకళ్ళని ప్రేమించదు రా, వచ్చిన వాళ్ళని అర్ధం చేసుకుని బ్రతకాలి రా" అని.... ఏ చదువు లేని అమ్మ, పెళ్ళికోసం తప్పితే ఇల్లు దాటకుండా పెరిగిన అమ్మకు  ఇంత లోతైన ఆలోచనలు ఎలా .....?

8 తరగతి నుండి చదువులకోసం అమ్మకి దూరంగా ఉంటూ వస్తున్నా ... ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్న నాతో ఏమి చెప్పేది కాదు, ....అదే అలవాటు  ఇప్పటికి ఏమి చెప్పదు, నేను ఎక్కడ అలోచించి బాధపదథానో అని ఎవరిని చెప్పనిచ్చేది కూడా కాదు .....
అమ్మ నీ ప్రేమ కన్నా గోప్పదయింది, నేను పొందగలిగిన వేరొక ఆనందం అంటూ ఏమి లేదు ..... 
నీ మీద ఒట్టు పెట్టి ఒక సారి మాత్రం తప్పాను ... నన్ను క్షమించు ...... 

ఏ తల్లి చెడ్డది కాదు, ఏ తల్లి బిడ్డ సుఖాన్ని కోరుకోని వారు ఉన్దరు.... 
లోకం లో ఉన్న మాతృ మూర్తులందరికీ, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ......... 



Friday, April 12, 2013

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము

బట్టలు ఊడతీసుకుని తిరుగుతున్న కాంగ్రెస్సు ప్రభుత్వము 

ఏలిన వారి బిడ్డ దోచుకునన్టున్నాడని, దాచుకోకుండా సమర్పించేసేసు కున్నారు మన రాష్ట్ర మంత్రులు . 

సమర్పించుకునేదేదో  ఆల్ల సొమ్మేదో సమర్పించుంటే బగున్డేది. మంది సోమ్మేగా!.....  మనకూ కాస్త విసిరేస్తాడెమో అని కుక్కల్లాగా, ఒక్కలన్ని మించి మరొకళ్ళు ఎగబడి ఎగబడి విశ్వాసాన్ని చూపించేసారు. మంచోళ్ళు ఎక్కువ కాలం బతకరు అన్తారు. ముంచే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు బతకరనుకుంట, అది పక్కన పెడితే రాజా వారు అందించిన దేవుడి పాలనని, ఆ దేవుడే వద్దని పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. 

ఇప్పుడిక సినిమా మొదలు అయ్యిన్ధి. 
కెలుక్కుంటే కంపు గట్టిగ వస్తదని ప్రభుత్వం ముక్కు మూసుకుని నడుస్తుంటే, కంపు ఎవరి దగ్గర నుండి వస్తందో ఖచ్చితం గా తెలియల్సిందే అని కోర్టు CBI  విచారణ మొదలు పెట్టించింది. హీరో లక్ష్మి నారాయణ డిసైడ్ అయితే జగన్ గ్యాంగ్ చంచల్ గూడా  జైలు సైడ్ అయిపోద్ది. మెయిన్ విలన్స్ గాలి, విజయ సాయి రెడ్డి, మోపిదేవి, శ్రీ లక్ష్మి, క్యామిడి  విలన్స్ నిమ్మగడ్డ, ఎలుగుబంటి జైలు కెల్లిపొయరు. రింగ్ మేకర్ కింగ్ మేకర్ జగన్ ఎందుకైనా మంచిదని ముందే మూసేసాడు అనుకోండి . 
ధర్మాన పైన ఛార్జ్ షీట్ వేస్తే, చెయ్యి పట్టుకుని రాజీనామా చెయ్యకుండా ఆపేసాడు మన కిరన్. సభిత పాపం GO అంత చదివి సంతకం పెట్టేటప్పుడు కళ్ళు మూసుకుని పెట్టింది కాబట్టి తనన్నిహోము నుండి రాజీనామా చెయ్యద్దని కిరణ్ కాళ్ళ వెల్ల బతిమలాడి రాజీనామా చెయ్యకుండా చూసుకున్నాడు. తన కొడుకు పైన కబ్జా కోరు, ధగ కోరు, రౌడీ రాజు అని అభియోగాలు వస్తే, నా కొడుకు బంగారం, అన్నోళ్ళు అందరు గొడ్డు గారాలు అని చెప్పే మేడం గారు ఆవిదకావిడ ఎలాగు రాజీనామా చెయ్యదు, సిగ్గు లేకుండా వీళ్ళు వెళ్లి మీరు నిశ్చింతగా ఉండండి అవసరమయితే ప్రభుత్వ కర్చులతో లాయర్ ని అందిస్తాము అని ఆషాడమాసం సేల్ ఇచి వచ్చాడు కిరణ్ 
అసలా ఆ జీవితానికి సిగ్గు అన్నది ఏడిస్తే గా.......  ఎప్పటినుండో సిగ్గు లేకుండా తిరుగుతున్నాము, సిగ్గే లేని దానికి కోత్తగా చీర కట్టుకోవడం ఎందుకు అంటున్నాడు కిరణ్, చీర ఎట్టాగు  లేదు కనీసం సిగ్గు బిళ్ళ అన్న కట్టుకో మని జనాల గోల .... 

............. సర్వ అవినీతి పరులు, కాంగ్రెస్సు హయాం సుఖినో భవంతు ..............

Tuesday, December 25, 2012

రేప్ ల భారతం ....

రేప్ ల భారతం ....


ద్రౌపది ని నిండు సభలో వివత్సరని చేయడానికి కౌరవులు ప్రయత్నించినందుకు గాను మాత్రమె కురుక్షేత్రం  యుద్ధం సంభవించింది. సీత దేవి అపహరణకు గాను మాత్రమె రామాయణ మహా యుద్ధం సంబవించింది. రెండిటిలోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రామాయణ మహాభారతాలు రెండు మహిళ చుట్టూనే మహిళ కోసమే జరిగినాయి. రాముడు ఉన్న కాలం లో రావణుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్న కాలం లో దుర్యోధనుడు ఉన్నాడు. కాని అధర్మం పైన ధర్మం, అసత్యం పైన సత్యం విజయాన్ని సాధిస్తాయని, ఈ సత్యాన్ని సర్వ వ్యాప్తి చేసి ప్రజలలో ధర్మ విచక్షణ రావాలని ఆనాటి చరిత్రలని ఈనాటికి చెప్పుకుంటూనే ఉన్నాము.

ఢిల్లీ లో జరిగిన సంఘటన ఈరోజు కొత్తగా జరిగినది కాదు, మనమెప్పుడు విననిది కాదు. రోజు ప్యాపర్ చదివే అలవాటు ఉంటె ఆ మూలనో ఈ మూలనో ప్రతిరోజు కనిపించే వార్త "యువతి పై అత్యాచారం", ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ లో అయితే అది ఒక రోజు వారి క్రీడ . అగ్ర కులం వారు, కింద కులాల ఆడవారు తమ వాంఛలు తీర్చే బొమ్మలుగా భావిస్తారు అక్కడ. కులం పేరుతోనో, అవసరం  పేరుతోనో, అవకాశాల పేరుతోనో  ఒక మగువ ని లొంగ తీసుకుని శరీరాన్ని అనుభవించే కుక్కలు గురించి మనం వింటూనే ఉంటాము..
ఇండియా లో లెక్కల ప్రకారం (కేవలం లెక్కల ప్రకారం మాత్రమే ) ప్రతి 20 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది, అందులో 25% కన్నా తక్కువ వాటిలో మాత్ర మే శిక్షలు పడుతున్నాయి, శిక్షలు కూడా నామమాత్రముగా ఉన్నాయి (1 లేదా 2 సంవత్సరాలు). ఈ సంవత్సరం మొత్తం 25,000 పైన రేప్ కేసులు నమోదయ్యాయి, లైగిక వేధింపులుతో కలుపుకుని అసలు సంఖ్య  కనీసం లక్షకి ధాటి ఉంటుంది, అంటే ప్రతి 500 మంది మహిలల్లో ఒకళ్ళు మన దేశం లో వేధింపులకి గురి అవుతున్నారు. అంటే రేప్ లని నిరోధించడం లో గాని, వాళ్ళని పట్టుకోడం లో గాని, మరియు కోర్టుల్లో శిక్షలు పడేటట్టు చెయ్యడం లో గాని మన  సంస్థలు ఎంతగా నిర్వీర్యం చెందాయో అర్ధమవుతుంది. కాకపోతే భారత దేశం లో ప్రభుత్వ సంస్థలు పనిచెయ్యకపోవడం అనేది మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి, ఈ విషయం లో మన చర్మము స్పందించదు కాబట్టి  దీని గురించి పదే పదే మాట్లాడుకున్న అనవసరము. , మనకు సిగ్గు వచ్చి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే వరకు మార్పు కోరుకోవడానికి మనం అనర్హులం.
 బొత్స సత్యన్నారాయణ డిల్లీ సంగటన పైన మాట్లాడుతూ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కదా అని అర్ధరాత్రి తిరిగితే ఎలా అని ప్రశ్నిచాడు. మనకి సిగ్గే ఉంటె వాడికి మల్లి వోటు వేసి గెలిపించము. కాని మనం కులానికో మతానికో ప్రాంతానికో భందుత్వానికో వోటు వేస్తాము గాబట్టి , Botsa you are safe. ఎవరో చెప్పినట్టు "India needs good leaders, but people do not deserve them" అన్నది నిజమేమో అనిపిస్తుంది.

కాని వీటి అన్నిటికన్నా ముఖ్యమయినది, అసల మన మనసుల్లో ఆడవారి పైన ఉన్న భావాలు ఏంటి. చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు అన్న తేడా లేకుండా, ఆడది అంటే మగవాడి కన్నా తక్కువ అన్న అభిప్రాయం పాత తరం నుండి కొత్త తరం వరకు పాతుకు పోయి ఉంది. అమ్మ ని నాన్న, చెల్లి ని అన్న, కోడలిని మామ, చులకన చేసే  సందర్భాలు రోజు మన ముందు జరుగుతూనే ఉన్నాయి. ఇలా మన కుటుంబము లో మన పిల్లలికే చిన్నప్పుడి నుండి ఆడది అంటే మగవాడి అదుపులో ఉండే వ్యక్తి అని  చూపిస్తున్నాము. ఆవిధంగా పెరిగి పెద్ద అయిన పిల్లడు ఏమి చేస్తాడు. ఇంకా జనాలు ఎంత మూర్కత్వం లో ఉన్నారంటే, నా స్నేహితుడి స్నేహితుడు ఒకడు అమెరికా లో ఉంటాడు, తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తను అన్నాడు, తనకి ఒక పాపా ఉందని, రెండవ సారి కూడా పాప అని తెలిసి తన భార్యకి అబార్షణ్  చేపించా అని , ఎంత సిగ్గు లేని పని, ఆ విష యాన్ని ఎ మాత్రం సిగ్గు లేకుండా మల్లి చెప్తున్నాడు, అది అమెరికా లో హై టెక్కు జాబ్  చెయ్యటానికి వచ్చిన వ్యక్తి. ఎన్ని చట్టాలు ఉంటె మాత్రం ఇతన్ని అదుపు చెయ్యగలము.
ఇంట్లో ఆడపిల్ల బయటికి వెళ్తే రోడ్డు పైన ఎవరన్నా ఏడిపించిన ఇంట్లో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఆ అమ్మాయిని అసల నువ్వు ఆ టైం లో అక్కడేమి చేస్తున్నావని తిడతారేమో అని. మానబంగానికి ఒక అమ్మాయి గురి అయితే అబ్బాయికి శిక్ష పడిందా లేదా అని పట్టించుకోడానికి ముందే అమ్మాయిని సమాజం నుండి వెలివేసే మనస్తత్వాలు, ఎవరన్న అల్లరి చేస్తే అది అమ్మాయి బట్టలకు ముడిపెట్టి తిట్టే సమాజం, ... వీటన్నిటిలో భాదితురాలు మహిళే  దానికి శిక్ష అనుభవించేది మహిళే కావడం భాధాకరం. 

సినమల్లో కులాన్ని ప్రస్తావించారని రోడ్డు ఎక్కే జనాలు, తమ  హీరో ల కోసం రోడ్డు ఎక్కి కొట్టుకునే జనాలు, మన MLA రౌడీ అయిన దగుల్బాజీ అయిన, కబ్జా కోరు అయినా మనకెందుకులే అనుకునే జనాలు , పక్క ఇంటిలోనే మగాడు తాగి వచ్చి అమ్మనో పెల్లాన్నో  పిల్లలనో కోడతంటే, మన తలుపులు బిగవేసుకుని మన ఇంట్లో  కూర్చుంటున్న ఈరోజుల్లో,  ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి దేశ వ్యాప్తము గా ప్రజలంతా చూపించిన ఈ చైతన్యం స్పూర్తినిస్తుంది. ఈ క్రైసిస్ ని అవకాశం  గ తీసుకుని ఇప్పటికైనా చట్టాలని  అలాగే దేశం లో మహిళల ఔన్నత్యాన్ని పటిష్టం చెయ్యడానికి కృషి జరుగుతుందని ఆశిస్తూ .........

ప్రభుత్వం వైపు  నుండి నేను కోరుకునే మార్పులు/సలహాలు

1. విధిగా 8.00 PM దాటిన తర్వాత వైన్ షా పులని మూసిఎయ్యడం, లేకుంటే అక్కడ ఉన్న ప్రజలు భాగస్వాములు అయ్యి మూపించడము (ఇది చాల ముఖ్యమైనది)
2. ఆడవారికోసం ప్రత్యేక బస్సు సర్వీసులని పెంచడము
3. ఎమ్మటే పోలీస్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి జనాభా ప్రాతిపదికన పోలిసుల సంక్యని, గస్తీ ని  పెంచడము
4. దేశ వ్యాప్తముగా 911 వంటి సర్వీసుని త్వరిత గతిన అందుబాటులోకి తీసుకుని రావడము
5. త్వరిత గతిన న్యాయాన్ని అందించడానికి, లైంగిక వేధింపుల చట్టాలని నిపునులతో మార్పులు
6. ప్రతీ ఆడపిల్లకి స్కూల్స్ మరియు కాలేజి లలో 'self defense' ని నేర్పించడము


Monday, June 11, 2012

TAKE PART and DO CARE

Recently one of my good friend’s younger brother died in a road accident. Due to several reasons, he couldn't even able to get to India to see him at last. This is one of such things that you never forget in your life.
My sister when she conceived, Doctors in India showed us hell, with their careless attitudes. Sitting here, I was so angry to an extent that I wanted to file a case in the police station.  In India, Society in general has transformed itself to a very dangerous level.


Accident, is this something happened out of bad luck? Keeping luck, karma siddhanthas, fate lines, jathaka chakras aside, can you say NO, If I say " the accident happened beacuse of the roads, lack of strict enforcement of traffic rules, and primarily beacuse of immoral, in active, incapable, impotent leaders who dont care about common man?"
When I was in my Bachelors or more particular when I was in Hyderabad, it’s a routine to see someone dying on a road due to accidents, seeing ambulance struggling to get to the accident location while the person bleeding to death.


in our lives, may be we have seen several things like, people with no homes, people dying of hunger, people dying of sunstrokes in summer, rains in monsoon and cold in Winter, people living roadside in huts, people struggling to get their grabbed lands, people murdered beacuse of land, sand, petrol, and power mafias, parents thrown away by their adult children, and so on ……Now I am here in US, I no more see those daily, I no more experience them on a daily basis, so shall I no more anticipate for betterment of India. Am I totally insulated from what’s going on back in India? Though everything of social living strings back to politics, shall I take no part in it and leave it as a foreign subject?
Some asks, being here, you don’t vote, you don’t be able to change, you don’t experience the problems, so why do you even think of them, just leave it? ...........But what to do, whether you like it or not, you still a part of it, a part of India, where your loved mother, father, sibling,  people who loved you, and people who cared for you are still living there. They affected means you affected. Today, I may say, it happened to someone, so I ignore it, but, same will sure happen to me tomorrow.
Like someone said,
I will do that one help that I can
I will donate that one dollar that I can
I will lead that one step that I can
I will sacrifice that one thing that I can
                …………….for the betterment
No matter where you are, please take part in good politics, help bring the CHANGE

Wednesday, May 9, 2012

"లోక్ సత్తా జే.పి దిగజారుడుతనము" కి సమాధానం

ఇటీవల  "గ్రేట్ ఆంధ్ర"  లో "లోక్ సత్తా జే.పి దిగజారుడుతనము" ( http://telugu.greatandhra.com/sangathulu/1-05-2012/loksa_8.php అనే వ్యాసము ప్రచురితమయినది.  అందులో లోక్ సత్తా ఉద్యమ నేతగా జే.పి  గారు పేరు గడించారన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచినందుకు ధన్యవాదాలు. అయితే అందులో రచయిత   జే.పి  గారి వ్యక్తిత్వము, సైద్దాంతికత  , రాజకీయ  నాయకత్వము, విలువలు పై అ శాస్త్ర్రీయమయిన   మరియు 
సత్యదూరమయిన  వ్యాఖ్యలు  చేసారని  బావిస్తున్నాను . ఈ  విషయము లో గ్రేట్ ఆంధ్ర  పాటకులకు  నిజాలను  శాస్త్ర్రీయ  ఆధారాలతో పరిచయము చేయడము మా భాద్యతగా బావించి ఒక లోక్ సత్తా మద్దతు దారుగా ఈ సమాధాన   వ్యాసము రాయడమయినది.  ఈ వ్యాస  ప్రచురణకు  అంగీకరించినందుకు గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి ముందుగా  మా కృతజ్ఞతలు.

ఎన్నికల నాడు తెలంగాణా సమస్యపై లోక్ సత్తా  మరియు ఇతర పార్టీల తీరు 
తెరాస, BJP లాంటి  పార్టీలు తెలంగాణా ప్రత్యెక రాష్ట్రమే అన్ని సమస్యలుకు పరిష్కారం అని ప్రచారం చేసాయి. కానీ  BJP అధికారములో ఉన్నప్పుడు తెలంగాణా ని వ్యతిరేకించి మరలా ఎన్నికలప్పుడు ప్రమాణం చేసింది.  తెదేపా, కాంగ్రెస్ లాంటి పార్టీలు సందర్భాన్ని బట్టి మాట చెపుతున్నాయి.  గెలుపే ప్రధానమని ప్రజలకు ప్రత్యెక రాష్ట్రము ఇస్తామని చెప్పాయి.  లోక్ సత్తా తెలంగాణ ఏర్పాటు వలన ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావని,  ప్రజలు కోరుకుంటే రాష్ట్రము ఏర్పడుతుంది కానీ, సమస్యలకు పరిష్కారంగా వికేంద్రికరణ, విద్య, ఉపాధి లాంటి అజెండా ని ప్రచారం చేసింది. 

డిసెంబర్  9th ప్రకటనకు ముందు మరియు తర్వాత  పార్టీల తీరు 
అన్ని పార్టీల సమావేశంలో పార్టీలన్నీ దోబూచులాడాయి. అందరూ తెలంగాణాకి అనుకూలమని సంకేతం ఇచ్చాయి.  లోక్ సత్తా మాత్రం ఈ సమస్యను ప్రజల దృష్టిలో, federal వ్యవస్థలో అలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మరియు చట్ట వ్యవస్థ చూపించే అలాంటి నిర్ణయాన్ని తాము మద్దతు ఇస్తామని చెప్పింది. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు జరిగిన సమావేశములో చెప్పిన మాట మార్చని పార్టీ లోక్ సత్తా.  ప్రకటన  తర్వాతప్రజల  మనోభావాలను ఆసరాగా తీసుకుని, రెచ్చ  గొట్టే ప్రసంగాలతో రాజకీయ  పార్టీ లు ఆటలాడుకుంటుంటే, విద్యార్ధులు ఆవేశాలకు లోనయ్యి ప్రాణాలు తీసుకుంటుంటే, లోక్ సత్తా మాత్రమె తమపై దాడులకి కూడా వెరవకుండా, ఆంధ్ర  ప్రాంతములో, " తెళంగాణ  ఇస్తే నష్టమేమిటని?",  తెళంగాణ  ప్రాంతములో, "రాష్ట్ర  సాధన  సర్వ  రోగ  నివారిణి కాదు అని, కాబట్టి సమయమునతో వ్యవహరించాలని" సూచిస్తూ భావో ద్వేగాలను చల్లార్చే ప్రయత్నము చేసింది.  

Telangana రాష్ట్రంపై  లోక్ సత్తా మనోభావం 
లోక్ సత్తా కానీ జయప్రకాశ్ నారాయణ గారు గాని ఏనాడూ తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖమని ప్రకటించలేదు మరియు వ్యతిరేఖంగా ప్రవర్తించలేదు.  గణాంకాలు, ఆరోపణలు, సాక్ష్యాలు  అన్ని ప్రాంతాల సమస్యలను చూపిస్తాయి. కానీ లోక్ సత్తా మూడు అంశాలను ఎప్పుడు గౌరవిస్తుంది - ప్రజల ఆకాంక్ష, రాజ్యాంగం మీద భక్తి మరియు ప్రజాసామ్యం లో చట్ట  సభల ప్రాముఖ్యము. హోం మంత్రి ప్రకటనని గౌరవించాలని చెప్పింది. అందుకే నాడు  శ్రీ కృష్ణ committee ని స్వాగతించింది. అదే committee గీత దాటిన నాడు విమర్శించింది. Governor ని అవమానించిన  రోజు, విగ్రహాలు పగల గొట్టిన రోజు JP గారు ఖండిచారు. కొన్ని పార్టీలు వీటిని చూపించి  లోక్ సత్తా తెలంగాణాకి వ్యతిరేఖమని  ప్రచారం చేసారు కానీ రాజ్యాంగం పైన ఉన్నమరియు సమాజము పైన  ఉన్న మక్కువను అర్థము చేసుకోలేదు. తెలంగాణా ప్రజల కోసం 610  జి.ఓ. మీద కానీ, 14 F గురించి గానీ, అవినీతి గురించి గాని, నీటి సమస్య మీద  కానీ ఆయన చేస్తున్న కృషి మరుగున ఉండి పోయింది.  ఆయన  రాష్ట్ర అసెంబ్లీ లో తెలంగాణా సమస్యపై చర్చించాలని ప్రతి అసెంబ్లీ సమావేశానికి ముందు కోరుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇక తాత్సారము చెయ్యరాదని రాష్ట్రాన్ని అయోమయంలో ఉంచవద్దని  ప్రధాన మంత్రి ని చిదంబరం గారిని కోరారు. వీధి పోరాటాలు మరియు ఆత్మ హత్యలు వద్దని చెప్పారు. ఇప్పుడు లోక్ సత్తా చెపుతున్నధీ అదే కానీ ఇతర పార్టీల విష ప్రచారం నుంచి ప్రజలను పార్టీ ని రక్షించాలని ప్రచార    భాష  ని సులభతరం చేసారు.  సమగ్ర చర్చతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో సామరస్యంగా తెలంగాణా ఏర్పాటు అయితే ఆహ్వానిస్తామని ప్రజలు కోరుకొంటే అలాగే జరుగుతుందని నమ్ముతున్నారు. ఇది పెద్ద మనిషి తనమే గాని దిగజారుడు తనం కాదు.

తెలంగాణా కోసం ఇప్పటివరకు లోక్ సత్తా ఏమి చేసిందంటే?
  •  డిసెంబర్ 9 ప్రకటన  నిమిత్తము  కేంద్ర  ప్రభుత్వము  ఒక  మాట  ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి  ఉండాలని, రాజకీయ  పార్టీ లు రోజుకోమాట  కాకుండా  నిబద్ధత  తో ఉండాలని గట్టిగ  నిలదీసింది.  అందుకు ఒక ప్రత్యెక శాసన సభ సమావేసము వేసి చర్చించాలని  తీర్మానము పెట్టారు.
  •  హైదరాబాద్  ఫ్రీ జోన్  కాదని రాష్ట్రపతి ఉత్తర్వులోని 14F ని తొలిగించేందుకు విశేష కృషి చేసింది మరియు అందరిని ఒప్పించింది.
  •  అలాగే రంగారెడ్డి జిల్లా రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగులకు   అనుకూలముగా  610 GO అమలుకు పోరాటము చేసింది.
  • హైదరాబాద్ నీటి సమస్య కోసం కృష్ణ phase -౩ ని పూర్తి చెయ్యాలని ప్రయత్నమూ చేస్తున్నది.
  • అసలే నీరు తక్కువగా ఉన్న తెలంగాణా నుంచి గోదావరి నీటిని హైదరాబాద్ తరలించవద్దని వాదించింది.
  • లోక్ సత్తా గెలిచిన కుకట్ పల్లి ని మోడల్ నియోజక వర్గంగా తీర్చి దిద్దుతున్నది ( http://kukatpallynow.com ) .  ఇప్పటి వరకు 750 కోట్లు వెచ్చించి జలాశయాలు, రోడ్లు, బళ్ళు, పార్కులు ఇంకా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అసలు అయిన  అజెండా విద్య మరియు ఉపాధి ని నమ్మి, trainings ఇప్పించి 2000 మంది కి ఉద్యోగాలు ఇప్పించారు. 
  • తెలంగాణా రైతు సమస్యలపై అధ్యయనం చేసి మార్కెట్ యార్డ్లు, కోల్డ్ storage కావాలని చెప్పారు. సిద్ధిపేట లో అది ఆచరణ లోకి తెప్పించారు.  జలయజ్ఞం పేరుతో జరుగుతున్న స్కాములని అరికట్టాలని, ఆచరణ సాధ్యం కానీ ప్రాజెక్ట్లు కాకుండా,  తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే ప్రాజెక్ట్లు ఉండాలని, ఆ నిధులు మరియు ఆ నిర్ణయాలు స్థానిక  ప్రభుత్వాలకి బదలాయించాలని లోక్ సత్తా వాదిస్తున్నది. 
  • తాత్కాలిక  సహాయంతో ఊరుకోకుండా వరదల వల్ల ఆర్ధికంగా వెనుక బడి పోయిన నాలుగు గ్రామాల్లో శాశ్వత సహాయం ఉండేలా చెయ్యాలని లోక్ సత్తా నిర్ణయించింది.  ఇందులో భాగంగా మహబూబ్ నగర్ కేసవరంలో పాటశాల కోసం మూడు తరగతి గదులు ఏర్పాటు చేసారు. 
తెలంగాణా ఏర్పడినా  ఏర్పాటు కాకున్నా లోక్ సత్తా పార్టీ గానీ,  అలాంటి అజెండా ఉన్న పార్టీలు గెలిస్తే గానీ మన రాష్ట్రానికి  లేక మన దేశానికీ అభివృద్ధి సాధ్యం కాదని మేము ఘాడంగా విశ్వసిస్తున్నాము.

కొన్ని ఆధారాలు
Lok Satta on Telangana

Lok satta work in model places in Telangana
Kukatpally http://www.kukatpallynow.com

ఇట్లు,
వెంకట కృష్ణ  పెందుర్తి,
ఒక Loksatta కార్యకర్త.
Email: pendurthi.venkat@gmail.com

Sunday, May 6, 2012

మారుతున్న జగన్ ....

ఎండాకాలం వదదేబ్బ కొట్టి చచ్చినోడు, వర్షాకాలం వానలకి చచ్చినోడు, పిడుగికి చచ్చినోడు, పాము కాటుకి చచ్చినోదు, మొగుడు బాధకి చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం బాధని తట్టుకోలేక చచ్చిన  భర్త ,  భర్త  బాధని తట్టుకోలేక చచ్చిన  పెళ్ళాం, కాదేది ఓదార్పు కి అనర్హం అన్నట్టు, కాతికేల్లిన  ప్రతి ఒక్కన్ని YSR కోసం చనిపోయాడని సినిమా చూపించి గత రెండున్నర సంవత్సరాలుగా ఒధర్చుకి తింటున్నాడు జగన్. రైతులు, మహిళలు, మద్యం, అప్పులు, నిరుద్యోగం, ఇలా సమస్య ఏదయినా సమాధానం మాత్రం ఓదార్పు యాత్రే జగన్ కి. మొన్నటికి మొన్న "నేనేగనక CM అయితే రాష్ట్రం లో అవినీతి లేకుండా చేస్తానని పెద్ద కామెడీ చేసేసాడు జగన్. పొద్దున్నే అయితే బురదగుంటలో బోర్లాడే ఆనందించే పంది "నాకే గనక   ఛాన్స్ వస్తే ఊర్లో బురద  లేకుండా చేస్తా" అన్నట్టుంది ఆ  ప్రకటన. మాటల్ల్లో కాస్త punch, force, ఉంటె చాలు దానికి అర్ధం పరమార్ధం పట్టించుకోకుండా విజిల్స్, చప్పట్లు కొట్టేస్తారు గాబట్టి షరా మామూలుగా దీనిక్కోడ్డా చప్పట్లు కొట్టేసి తిని పడుకున్నారు జనాలు. 
 

YSR ఆత్మ అయిన KVP, YSR కి నీడ  గా చెప్పుకునే సూరీడు ఇద్దరినీ తన దుడుసుతనం, అహంబావం తో దూరం చేసుకున్న గడసరి జగన్. సినీ హీరో రాజశేఖర్ ని కూడా తట్టుకోలేనంత, భరించలేనంత   అసూయ  కలిగిన జగన్  ధోరణిలో ఈ  మధ్య  మార్పు గమనించి ఆశ్చర్య  పోతున్న. ఎవ్వరిని నమ్మని, ఎవ్వరిని గౌరవించని , ఎవ్వరిని ఆత్మీయం గా ఫీల్ కాని జగన్ ఒంటెద్దు పోకడ ఈ మధ్య  కాస్త   మారినట్టు అనిపిస్తోంది. రాజకీయాలని ఈ రెండు సంవత్సరాల  కాలం లో కాస్త  రక్తం లో చేర్చుకున్నదేమో కాని వేరే వాళ్ళతో కలిసి వెళ్ళాలి అన్న ఇంగిత జ్ఞానం తత్ట్టినట్టుంది. జన్మత్: శత్రువులు అని ఫీల్ అయ్యే సామాజిక వర్గానికి దగ్గర కావాలనుకోడం, ఎవ్వరిని పట్టించుకోని లేదా ఉన్నవాళ్ళని కూడా దూరం చేసుకోగల   నేర్పరి అయిన  జగన్, మోహన్ బాబు ఇంటి గడప  తొక్కడం,  తెలుగు దేశం లోని కమ్మ సామాజిక వర్గాన్ని చేరదీయడం, రోజా ని దువ్వి మల్లి దారి లో పెట్టడం, చూస్తూ ఉంటె జగన్ ధోరణి రాజకీయ  పరిణతి లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నై. ఎ పార్టీ గెలుస్తున్దనుకుంటే ఆ పార్టీ లో కి జంప్ చేసే జంపింగ్  జాక్ లు కి ప్రధాన  శిభిరముగా తయారయ్యింది  యువజన  శ్రామిక  రైతు (YSR ) కాంగ్రెస్  పార్టీ. 

ఇంగితం ఆలోచన , నైతికత , నాయకత్వ లక్షణాలు , న్యాయం, ధర్మము, ఆలోచింఛి నిర్ణయం తీసుకోగల  శక్తి మన జనాలకి లేదు గాబట్టి ఎలాగు 2009 లో కాంగ్రెస్ ని గెలిపించి అరగుండుగా మిగిలిన   రాష్ట్రాన్ని ఈ సారి YSR Congress  పార్టీ ని గెలిపించి పరిపూర్ణ  గుండుగా మారుస్తారేమో. 

Wednesday, March 28, 2012

30 ఇయ్యర్స్ ఇండస్ట్రీ....TDP

భూమి పై ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి తెలుగు వాడు, ఆసక్తి తో చూస్తుండగా, డిల్లి గడ్డ పై పాలకులకు ముచ్చెమటలు పోయించడానికి సిద్దమవుతూ, NTR నోటిలోనుంచి తెలుగువాడి కోసమే ప్రసవించిన తెలుగు దేశం నేటితో ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బముగా హార్దిక శుభాకాంక్షలు. 


శ్రామికుడి చెమట లో నుండి
కార్మికుడి కండలలో నుండి
రైతు కూలీల రక్తం లో నుండి
నిరు పేదల కన్నీటి లో నునిడ్
కాస్త జీవుల కన్నీళ్ళలో నునిడ్
అన్నర్దుల ఆకలి లో నుండి 
తెలుగు వడ్డీ వాడి వేడి చాటి చెప్పడానికి
తెలుగు వాడి ఆత్మా గౌరవం నిలబెత్తనికి పుట్టిన్ధంటూ అన్న గారు చెప్పి ౩౦ సంవత్సరాలు గడిచిపోయాయి


అన్నగారిని చూసి మంత్ర ముగ్ధులై, జనం ప్రభంజనం సృష్టించారు , వేరెవ్వరు సాధించని, సాధించలేని అఖండమైన majority ని అందించి, AP సింహాసనం పైన సింహాన్ని కూర్చోపెట్టారు.
అన్నగారి పుణ్యమో, రాష్ట్రము లో పెను మార్పులు, పరిపాలన లో కొత్త పుంతలు, పేదవాడికి కుర్చీ వేసి కూర్చోబెట్టింది తెలుగు దేశం ప్రభుత్వం. అన్నగారు చనిపోయేవరకు, పేద వాడు తెలుగు దేశం ప్రభుత్వం అన్యోన్య దాంపత్యం చేసాయి. 
చనక్యునికి చీదర వేసే నీతి తో, చంద్రబాబు ముక్యమంత్రి పీతాన్ని కైవసం చేసుకుని, పేద వాడి చుట్తో తిరిగిన పార్టీ ని, HiTech రంగమ వైపు పరిగెత్తించారు. టెక్నాలజీ రంగం లో రాష్ట్రము సరికొత పయన్నని ఆరంబించి, మరొక్కసారి దేశం రాష్ట్రము వైపు చూసేలా చేసారు. స్వయం తప్పిదాలతో పీతం చేజార్చుకున్న చంద్ర బాబు, అధికారం దూరమయ్యి  7 సంవత్సరాలు ముగుస్తుంది. 30 సంవత్సరాలలో 17 సంవత్సరాలు అధికారం అనుభవించిన TDP నేటి రాజకీయ కీచులాటలో చిగురుటాకుల వనుకుతుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు, గురువుని మించిన శిష్య్లు తయారయ్యి, చ్నంధ్ర బాబు కి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నా స్నేహితుడు అనట్టు, ఇదంతా NTR valla వాడికి అంటిన పాపం అని, ..... వాళ్ళ పాపమో రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమో, రాష్ట్రము శయనీయ పరిస్తుల్లోకి వెళ్ళిపోతుంది
మనఃస్పూర్తిగా తెలుగు దేశం కోలుకోవాలని కోరుకోక పోయిన, ఆ పార్టీ అందించిన పరిపాలనకి నా కృతజ్ఞతలు.


కొత్త తరానికి, కొత్త ఆలోచనలకి, సరి కొత్త లక్ష్యాలని సాధించడానికి, దేశం  సరికొత ఉన్నత శికరాలను చేరుకోడానికి........, పార్టీ పెట్టిన  30 ఏళ్ళ తర్వాత, తను ఆవిర్భవించినప్పటి నూతనత్వముతో నిజాయితి తో ముందుకు రావాలని కోరుకుంటూ...... మరియు., ఈ సందర్భముగా అన్న గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, ఇప్పటికి సెలవు...