Pages

దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే

తెలంగాణ  రాక ముందు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికం గా జరపడం లేదని నానా యాగి చేసి న KCR , తెలంగాణ  ప్రాంతం కు స్వాతంత్రం వచ్చిన రోజును అధికారికం గ జరపని ఆంధ్ర నాయకులకి ఇంగిత జ్ఞానం లేదని చెప్పిన కోదండ రామ్ -  ఈరోజు 17 వ తారీకున, తెలంగాణ స్వయం పాలనలో,  విమోచన దినోత్సవాన్ని అధికారికం గ జరుపుకోవడం కుదరదని చెప్పినప్పుడు సిగ్గు గా  అనిపించలేదా?.  17 వ తారీకు అధికరికమగా జరుపుకోము అని చెప్పడం, తెలంగాణా ఆత్మ గౌరవాన్ని, సాయుధ పోరాటం లో ప్రాణాలు అర్పించిన తెలంగాణా ప్రజలని, మానాలు కోల్పయిన వేలాది మంది మహిళలు గౌరవాన్నిఎవడి కాల్ల కింద తాకట్టు పెట్టడం వల్ల అలా చెప్పావు!. ఈ చర్య ఆనాటి ఉద్యమాన్ని  ని అవమాన పరచడం కాదా.?
స్వతంత్రం వచ్చిన తదుపరి, తెలంగాణా ని పాకిస్తాన్ లో కలిపెస్తము అని ప్రకటించిన నిజాం, వాడి పేరు చెప్పుకునే తిరిగే చంచా ల మద్దతుకోసం ఇంతకి తెగించాలా.? రాజకార్లతో వేల కొద్దీ హత్యలు, మానబంగాలు చేపించిన నిజాం ఎలా గొప్పవాడో KCR  కే తెలియాలి. హైదరాబాద్ మెట్రో ని NizMetro  గ ఎందుకు పేరు మారుస్తున్నావు ?September 17 మంచిఉ రోజా, చెడ్డ రోజా అనే దాని పైన TRS వాళ్ళ స్టాండ్ ఏంటో ప్రజలకి చెప్పాలి. KCR  భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి CM  అయ్యావు కాని, మజ్లీస్ పార్టీ పైనో, పాకిస్తాన్ రాజ్యాగం పైనో కాదు దరిద్రపు ఆలోచనలు చేస్తే మిగిలేది దరిద్రుడు అన్న పేరు మాత్రమే. ............ for India